Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగాలను భర్తీ చేయాలి:విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ మానవతారాయ్
నవతెలంగాణ-ఓయూ
యూనివర్సిటీలకు వెంటనే వీసీలను నియమిం చాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ మానవతారాయ్ డిమాండ్ చేశారు. ఈ నెల 29 వరకు ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న పోరుయాత్ర మంగళవారం ఓయూలో ప్రారంభమైంది. ఓయూలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి నర్సయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించడంతో యాత్ర మొదలయింది.ఈ సందర్భంగా మానవతారా రు మాట్లాడుతూ.. ఓయూలో ప్రారంభమైన ఈ యాత్ర బుధవారం నిజామాబాద్ తెలంగాణ విశ్వవి ద్యాలయానికి చేరుకుంటుందని, 23న కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ, 24న వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం, 25న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 26న ఖమ్మం, 27న మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, 29 పాలమూరు విశ్వవిద్యాలయానికి చేరుకుంటుందని చెప్పారు. అక్కడితో యాత్ర ముగుస్తుందన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థలను రద్దు చేసి ఉద్యోగాలను నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, లెక్చ రర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడదల చేయాల న్నారు. యూనివర్సిటీలకు వెంటనే వీసీలను నియ మించి, ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. టీఆర్టీ ప్రకటించి ఖాళీగా ఉన్న 40వేల ఉద్యోగాలను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏ సీ రాష్ట్ర అధ్యక్షులు సోమగాని నరేందర్ గౌడ్, నిరుద్యోగ సంఘం అధ్యక్షులు కొప్పుల ప్రతాప రెడ్డి, ముడావత్ భిక్షునాయక్, జానకి రామ్, జగన్నాథ్ యాదవ్, తాటికాయల మౌనిక, అనీల్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఓయూ బంద్ విజయవంతం
ఓయూ పీహెచ్డీ విద్యార్థి నరసయ్య మృతిని నిరసిస్తూ మంగళవారం విద్యార్థి సంఘాలు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు నరసయ్య చిత్ర పటానికి నివాళ్లర్పించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కేసీఆర్ ఇకనైనా స్పందించి ఉద్యోగాల నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేశారు.