Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటి ఎన్ఓసీ కోసం రూ.30వేలు డిమాండ్
నవతెలంగాణ- ఘట్కేసర్ రూరల్
పోచారం మున్సిపాల్టీ పరిధిలోని ఇస్మాయిల్ఖాన్ గూడలోని ఓ వ్యక్తి నుంచి బిల్ కలెక్టర్ పి.కుమారస్వామి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇస్మాయిల్ ఖాన్గూడకు చెందిన సిహెచ్.బాలరాజ్గౌడ్ తన వదిన (3-47/1) ఇంటికి ఎన్ఓసీ కావాలని ఆరునెలల కింద దరఖాస్తు చేశాడు. ఎన్ఓసీ కావాలంటే రూ.30వేలు లంచం ఇవ్వాలని బిల్ కలెక్టర్ కుమార్స్వామి డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు తాను అంత ఇచ్చు కోలేననడంతో రూ.10వేలు ఇవ్వాలన్నాడు. దీంతో బాలరాజుగౌడ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఇస్మాయిల్ఖాన్గూడ మున్సి పాల్టీ వార్డు ఆఫీసులో బాలరాజుగౌడ్ నుంచి రూ.10 లంచం తీసుకుంటుండగా బిల్ కలెక్టర్ కుమారస్వామిని పట్టుకున్నారు.