Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్కు ట్రెసా వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డిప్యూటీ కలెక్టర్ల ఖాళీలను అర్హులైన తహసీల్దార్లచే భర్తీ చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్రెడ్డి, కె.గౌతమ్ కుమార్ మెమో రాండాన్ని బుధవారం అందజేశారు. రాష్ట్రంలో 120 డిప్యూటీ కలెక్టర్ల స్థానాలున్నాయనీ, వాటిలో తహసీల్దార్లకు పదోన్నతి కల్పించాలని సీఎస్ను వారు కోరారు.
165 తహసీల్దార్ ఖాళీలను అర్హులైన ఉప తహసీల్దార్ లచే డీపీసీ ద్వారా వెంటనే భర్తీ చేయాలనీ, జిల్లాల్లో ఆర్డర్ టూ సర్వ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలనీ, ఎన్నికల సందర్భంగా బదిలీ అయిన తహసీల్దార్లను తిరిగి సొంత స్థానాలకు పంపాలనీ, పెండింగ్ రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని విన్నవిం చారు. ఈ విషయాలపై సీఎస్ సోమేశ్కుమార్ సానుకూలంగా స్పందిం చారనీ, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సీఎస్ను కలిసిన వారిలో కల్చరల్ అండ్ స్పోర్ట్స్ కార్యదర్శి బి.రవీందర్, కార్యదర్శులు సంతోష్ లాల్, పల్నాటి శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు.