Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి 20 వరకు దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాల్లో 34 ప్రిన్సిపల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)లో 19 పోస్టులకు, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీలో 15 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఆన్లైన్లో మార్చి 20 వతేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చును. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ కోటా గల వారు కనీసం 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్లైన్ అప్లికేషన్ ఫారాలను మార్చి 30వ తేదీలోగా హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్లో గల డీఎస్ఎస్ భవన్లో సమర్పించాలి. గతంలోనే దరఖాస్తు చేసుకున్న వారు ఎలాంటి ఫీజు లేకుండా తమ ఐడీలతో ఆప్షన్లను ఈనెల 24వ తేదీ నుంచి మార్చి పదో తేదీ వరకు మార్చుకునే వెసులుబాటును బోర్డు కల్పించింది. మరిన్ని వివరాలకు కోసం షషష.్తీవఱతీb.అవ్, షషష.్వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ సంప్రదించగలరు.