Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్కు తెలంగాణ ఉద్యోగ జేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ని ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ను బుధవా రం హైదరాబాద్లో జేఏసీ చైర్మెన్ కారం రవీందర్రెడ్డి, సెక్రెటరీ జనరల్ వి మమత, నాయకులు ఎం రాజేందర్, పి మధుసూదన్రెడ్డి, బి రేచల్, కస్తూరి వెంకటేశ్వర్లు, ఉమ, కొండల్రెడ్డి, కృష్ణయాదవ్ తదితరులు కలిసి వినతిపత్రం సమర్పించారు. పీఆర్సీ గడువును డిసెంబర్ వరకు పొడిగిం చడంతో ఇక పీఆర్సీ రాదేమోనని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఉద్యోగ సంఘాల నాయకుల ను పిలిపించుకుని పీఆర్సీ, ఉద్యోగ విరమణ వయస్సును పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని వెంటనే నెరవేర్చాలని కోరారు. ఉద్యోగులకు గౌరవప్రదమైన పీఆర్సీ మంజూరు చేయాలని కోరారు. పీఆర్సీ వేతన సవరణకు మాత్రమే పరిమితం కాదని సీఎస్ సోమేష ్కుమార్ వివరించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక శాఖల సమన్వయం, సర్వీసు నిబంధనల సవరణలు, రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుకూలంగా జిల్లా, జోనల్, మల్టీజోనల్, రాష్ట్రస్థాయి పోస్టుల స్థిరీకరణ, రాష్ట్ర విభజనలో భాగస్వామ్యం అయిన కార్యాల యాల్లో సిబ్బంది మార్పులు, చేర్పులు వంటివి పీఆర్సీ కమిటీకి అప్పగిం చామని సీఎస్ చెప్పారని పేర్కొన్నారు. ఈ పనులన్నీ పూర్తికావడానికే పీఆర్సీ గడువును పొడిగించామన్నారని తెలిపారు. వేతన సవరణకు సంబంధించి నివేదికను వెంటనే తెప్పించుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఉద్యోగులు అభద్రతకు లోనుకావొద్దని, త్వరలోనే సీఎం ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రకటించారని తెలిపారు.
ఐఆర్ ఇవ్వాలి : సీఎస్కు పీఆర్టీయూ వినతి
పీఆర్సీ గడువును డిసెంబర్ వరకు పొడిగించడంతో 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ను పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి శ్రీపాల్రెడ్డి, బి కమలాకర్రావు కలిసి వినతిపత్రం సమర్పించారు.
పీఆర్సీని అమలు చేయాలి : కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం
పీఆర్సీని అమలు చేయాలని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, అసోసియేట్ అధ్యక్షులు కెపి శోభన్బాబు, అధికార ప్రతినిధి జబీఉల్లా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.