Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మేళనంలో ఎమ్మెల్యేల మాటల యుద్ధం
నవతెలంగాణ - క్లాక్టవర్
నల్లగొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నిర్వహించిన పంచాయతీరాజ్ సమ్మేళనంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది. 'నువ్వెంత అంటే నువ్వెంత' అంటూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. పథకాల పేర్లు మార్చుతున్నారే తప్ప గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదని రాజగోపాల్రెడ్డి అనగా.. 70 ఏండ్ల్లలో చేయలేని అభివృద్ధి ఆరేండ్లలో చేసి చూపించామని.. మీకు కనిపించడం లేదా అంటూ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఘాటుగా సమాధానం చెప్పడంతో వివాదం తలెత్తింది. ఈ విషయంపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. సభకు వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు రాజగోపాల్రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, అక్కడే ఉన్న జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్తో పాటు పలువురు అధికారులు ఇద్దర్నీ సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది.