Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్లంపల్లి నుంచి విడుదలకు సీఎం ఆదేశం
- పునరుజ్జీవ పథకం ద్వారా తరలించాలని సూచన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీ వరదకాల్వకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకాన్ని ఉపయోగించుకొని నీటిని తరలించాలని ఆయన సూచించారు. యాసంగి పంటకు సాగునీరు అందించటానికి అవసరమైన నీటి నిల్వ శ్రీరామ్సాగర్ ప్రాజెక్టులో లేనందువల్ల ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన సీఎం కేసీఆర్ వరదకాలువకు ఎస్పారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా నిర్మించిన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించాలని చెప్పారు. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం, లక్ష్మీ పురం, రాంపూర్, రాజేశ్వరపేట మీదుగా వరదకాల్వలోకి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలన్నారు. దీనివల్ల బాల్కొండ, జగిత్యాల, చొప్ప దండి, కరీంనగర్, వేములవాడ, ధర్మపురి నియోజకవర్గాల పరిధి లోని ఎస్సారెస్పీ కింద రబీకి నీరు అందించాలని చెప్పారు. సీఎం ఆదేశాల మేర కు నీటిని విడుదల చేస్తున్నట్టు నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ చెప్పారు.