Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్శాఖ, ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 21 వరకు చైన్నైలో రెండవ అంతర్జాతీయ ఇంటర్నెట్ అప్ థింగ్స్ జరుగుతున్నాయి. రిజిస్ట్రార్ డాక్టర్ సేతురామన్ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యలో పరిశోధనలు చేయాలని, దాంతోపాటు తమ వంతు సమాజానికి తోడ్పడాలని ఆయన ప్రసంగించారు. ఈ సమావేశానికి వివిధ దేశాల నుంచి సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ప్రొఫెసర్ డాక్టర్ విద్యాచరణ్(శాన్ఫ్రాన్సిసో), ప్రొఫెసర్ డాక్టర్ రాఘవేంద్ర బేలూర్జన(రష్యా) మొదటి రోజు సమావేశంలో మాట్లాడారు. ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్ ధన్యవాదాలు తెలుపుతూ ప్రారంభోత్సవం ముగించారు. దుబారు, కెనడా, కువైట్, డీఆర్డీఒ, సీఎస్ఐఆర్ నుంచి శాస్త్రవేత్తలు ప్రసంగించనున్నారు. విద్యా పారిశ్రామిక రంగాలలో అసాధారణమైన అవకాశాలు కల్పించటమే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. నాల్గో సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు తమ ప్రాజెక్ట్లను ప్రదర్శించేందుకు ఈ సమావేశం చక్కటి అవకాశం. ఈ సమావేశంలో వివిధ కళాశాలల నుంచి మూడు వందలకు పైగా విద్యార్థి గ్రూపులు హాజరై తమ ఆవిష్కరణలు ప్రదర్శించనున్నారు. ప్రొఫెసర్ డాక్టర్ అముద, హెడ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్శాఖ, ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ఎస్ పొన్మగళ్ల ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.