Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిర్యాణి
గన్ను శుభ్రం చేస్తుండగా మిస్ఫైర్ అయి కానిస్టేబుల్ తల్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటన కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల కేంద్ర పోలీస్స్టేషన్లో శనివారం జరిగింది. సెంట్రి విధులు నిర్వర్తిస్తున్న టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఎస్.కిరణ్కుమార్ ఎస్ఎల్ఆర్ గన్ను శుభ్రపరుస్తుండగా మిస్ఫైర్ అయింది. దీంతో ఆయన తలలోకి బుల్లెట్ దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు. తోటి సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంచిర్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదవశాత్తు జరిగింది: ఏఎస్పీ
గన్ను శుభ్రపరిచే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఏఎస్పీ సుధీంద్ర తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ఎస్.కిరణ్కుమార్ గుడిపేట 13వ బెటాలియన్కు చెందినవాడు. 2013లో ఉద్యోగంలో చేరాడు. బదిలీపై ఐదు నెలల కిందట తిర్యాణి పోలీస్స్టేషన్కు వచ్చాడు. మరో పది నిమిషాలైతే విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలోనే ప్రమాదం జరిగిందని ఎస్పీ తెలిపారు.