Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇప్పటికీ 50 శాతం మంది రైతులు రుణాల కోసం ప్రయివేటు వ్యక్తులు, సంస్థలపై ఆధారపడాల్సి రావడం దారుణమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఈ పరిస్థితిని గట్టక్కేందుకు సరైన సమయంలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, నిల్వ సదు పాయాలు, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు, గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన అగ్రిటెక్-2020, అగ్రివిజన్-2020 సదస్సు, ప్రదర్శనను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి పారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం మంచి పనితీరు కనబరుస్తోందని ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌంమంత్రి మహమూద్ అలీ, సీఐఐ తెలంగాణ చైర్మెన్ డి,రాజు, అగ్రిటెక్ సౌత్-2020 చైర్మెన్ అనిల్కుమార్ ఏవూరు, సీఐఐ వ్యవసాయ ప్యానల్ కన్వీనర్ జీవీ సుబ్బారెడ్డితో పాటు విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు.
ఆయిల్పామ్ సాగుకు
కేంద్రం గ్రీన్సిగ్నల్ : మంత్రి
రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు చేసేందుకు అనుమతించడం పట్ల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్ పామ్ సాగుకు అనుమతిస్తూ కేంద్రం లేఖ రాసినట్టు తెలిపారు. రాబోయే రెండేండ్లల్లో 45,250 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా చెప్పారు. 2019-20 ఏడాదికిగాను 2500 ఎకరాల్లో తెలంగాణ ఉద్యానవన శాఖ ప్రయోగాత్మకంగా ఆయిల్పామ్ సాగును ప్రారంభించిందని వెల్లడించారు. బీజేపీ నేతలకు పనేమి లేదు బీజేపీ నేతలకు పనేమి లేకనే రాష్ట్ర సర్కార్పై విమర్శలు చేస్తున్నారని మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటరుణాలు పెంచాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారనీ, అది కేంద్రం పరిధిలోని అంశం అనే విషయం వారికి తెలియదా? అని ప్రశ్నించారు. రైతుబంధు అందరికి అందుతున్నదన్నారు.