Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఎన్.శ్రీధర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
2020-21 సంవత్సరంలో 675 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా నిర్దేశించినట్టు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. దీనికి సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.3వేల కోట్ల పెట్టుబడుల అంచనా వ్యవయానికి బోర్డు అమోదం తెలిపిందని చెప్పారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో శనివారం 552వ సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ జరపడానికి బోర్డు ఆమోదించిందని తెలిపారు. ఓపెన్ కాస్టు గనులకు సంబంధించి వివిధ రకాల ఓబీ తొలగింపు పనులకు కూడా ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. ఓసీ గనుల్లో ధూళి నివారణకు వినియోగించే స్ప్రింక్లర్ ట్యాంకర్ల కొనుగోలుకు, భారీ సామాన్లు తరలించే క్రేన్ల కొనుగోలుకు, మైన్ ప్లాన్కు సంబంధించిన కొత్త ప్రతిపాదనలకు బోర్డు అంగీకరించినట్టు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఇంధనశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజరు మిశ్రా, కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఉప కార్యదర్శి పిఎస్ఎల్ స్వామి, వెస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ చైర్మెన్ రాజీవ్ రంజన్ మిశ్రా, సింగరేణి డైరెక్టర్లు ఎస్.శంకర్, ఎస్.చంద్రశేఖర్, బి.భాస్కర్రావు, ఎన్.బలరాం, సీడీఎస్ జీఎం ఆంటోనిరాజా, కంపెనీ సెక్రెటరీ గుండా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.