Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీసీ ఉద్యోగుల కోసం చీఫ్ లైజన్ ఆఫీసర్ (సీఎల్ఓ)గా జనరల్ మేనేజర్ (పీ అండ్ పీ) పి.సత్తయ్యను నియమించాలని సింగరేణి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షులు పి.శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శి సముద్రాల శ్రీనివాసు సారథ్యంలో నాయకులు యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. సింగరేణి భవన్లో డైరెక్టర్ అండ్ ఆపరేటషన్స్ ఎన్.చంద్రశేఖర్ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఉపాధ్యక్షులు బి.హరిప్రసాద్, సంయుక్త కార్యదర్శి కె.రాజేందర్, కోశాధికారి ఎం.దామోదర్రావు, రామక్రిష్ణ, బి.మహేష్ ఉన్నారు.