Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో శనివారం రాత్రి భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో 18వ అంతర్ రాష్ట్రస్థాయి తెలుగు నాటకోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నాటక పోటీలను తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్ చైర్మెన్ తాళ్లూరి పంచాక్షరయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాచలంలో 17 ఏండ్లుగా భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటక పోటీలను అలరిస్తున్న ప్రేక్షకులే కళాకారులన్నారు. ఈ ఏడాది కూడా వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు తరలిస్తున్నారన్నారు. టీవీ, సినీ రంగాల్లో రాణించిన పలువురు ప్రముఖులను భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా సన్మానించనున్నట్టు తెలిపారు. అనంతరం హైదరాబాద్ కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన 'జగమేమాయ' నాటకం ప్రేక్షకులను అలరింపజేసింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కళాభారతి అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్, ఐటీసీపీఎస్పీడీ మేనేజర్ చెంగల్రావు, సోమరౌతు శ్రీనివాస్, కళాభారతి కన్వీనర్ చావ లక్ష్మీనారాయణ, భద్రాద్రి కళాభారతి ఫౌండర్, సెక్రటరీ అల్లం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.