Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పెనుబల్లి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం ఫారంలో కోళ్లకు వైరస్ సోకడంతో శనివారం ఒక్కరోజే 30వేలకు పైగా మృత్యువాత పడ్డాయి. ఫారంలో లక్షకు పైగా కోళ్లు ఉండగా, ఇప్పటికే సగానికి పైగా మృతిచెందినట్టు యజయాని సూర్యదేవర రవికుమార్ తెలిపారు. వ్యాధి నిరోధక టీకాలు, ఇతర మందులు వాడుతున్నా వైరస్ను అదుపు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తను రూ.లక్షల్లో నష్టపోయినట్టు తెలిపారు. మృతిచెందిన కోళ్లను పూడ్చటం తలనొప్పిగా మారింది. కొన్ని కోళ్లను ఫారం పరిసరాల్లో పూడ్చిపెట్టగా, మిగిలిన కోళ్లను పూడ్చేందుకు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు.