Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయాలని టీపీసీసీ అధ్యక్షులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమనీ, రాష్ట్రం ఆర్థికంగా దేశంలోనే నెంబర్వన్ అని చెప్పుకుంటు పీఆర్సీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కమిటీ కాలపరిమితిని ఎందుకు పొడిగించారు? పొడిగింపు కోసం సభ్యులు చెప్పిన అంశాలను ఎందుకు బహిరంగపరచడం లేదో సమాధానం చెప్పాలన్నారు. కనీసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు ఐఆర్ అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు.