Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేర్వేరు చోట్ల నీటిలో పడి తొమ్మిది మంది మృతి
- చెరువులోకి కారు దూసుకెళ్లి ముగ్గురు జలసమాధి
- చేపలవేటకు వెళ్లి తండ్రీకొడుకులు..
- స్నానం చేసేందుకు వెళ్లి మరో ఇద్దరు..
నవతెలంగాణ-రామన్నపేట/ బోధన్/వేములపల్లి/గణపురం
సరదాగా స్నానం చేసేందుకు వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తుండగా కారు చెరువులోకి దూసుకెళ్లి ముగ్గురుజలసమాధి అయ్యారు. చేపల వేటకు వెళ్లి తండ్రీకొడుకులు ప్రమా దవశాత్తు చెరువులో పడి మరణించారు. పొలం పనులు చేసుకుని కాల్వ దాటుతున్న రైతు జారిపడి అందులోనే ప్రాణం కోల్పో యాడు. పలుజిల్లాల్లో శనివారం తొమ్మిది మంది నీటమునిగి మరణించడంతో ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలం సర్నేనిగూడెం సర్పంచ్ దర్నే రాణి భర్త ధర్నే మధు (36), కుమారుడు మణికుమార్(10), సాగుబావిగూడెంకు చెందిన మధు స్నేహితుడు నన్నూరి శ్రీధర్ రెడ్డి (26) స్నానం చేసేందుకు వ్యవసాయ బావి వద్దకు కారులో వెళ్లారు. తిరిగొస్తుండగా వెల్లంకి గ్రామంలోని చెరువు కట్టపైకి రాగానే కారు చెరువులోకి దూసుకెళ్లింది. కారు పూర్తిగా మునిగిపోయి ఊపిరాడక ఆ ముగ్గురు అందులోనే ప్రాణం విడిచారు. శుక్రవారం రాత్రి కావడంతో కారు చెరువులో పడిన విషయం ఎవరూ గమనించలేదు. కుటుంబ సభ్యులు ఆరా తీయగా సీసీ కెమెరాలను పరిశీలించి అన్వేషించడంతో విషాదం బయటపడింది. మణికుమార్ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. శ్రీధర్రెడ్డి ఐటీఐ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మినార్పల్లికి చెందిన కోల దీప్లనాయక్(58), కుమారుడు శ్రీనివాస్ (27) చేపలు పట్టేందుకు మద్దికుంట చెరువుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు జారిపడి మరణించారు. శ్రీనివాస్ భార్య గర్భవతి కాగా, ఒక కూతురు ఉంది. బోధన్ రూరల్ ఎస్ఐ అహ్మద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలంలో వరాల సమ్మయ్య (50) పొలం పనులు చేసుకుని కాల్వ దాటుతుండగా అందులో పడి మరణించాడు. భార్య, ముగ్గురు కూతుళ్ళు, కొడుకు ఉన్నట్టు ఎస్సై రాజన్బాబు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన తొవ్వల మల్లయ్య (55) శుక్రవారం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తెల్లవారుజామున పాండవుల చెరువుపై చెప్పులు కనిపించడంతో అన్వేషించగా మృతదేహం బయటపడినట్టు సీఐ ఆంజనేయులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్లోని చెక్డ్యాంలో పడి గుజరాత్కు చెందిన ఆదిత్య(21) మృతిచెందాడు. ప్లాస్టిక్ డబ్బాలు విక్రయిస్తున్న అతను స్నానం కోసం వెళ్లి నీటి గుంతలో మరణించినట్టు తెలిసింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం సాగర్ కాల్వలో స్నానం చేసేందుకు వెళ్లి ఈతరాక మిర్యాలగూడ పట్టణం శాంతినగర్కు చెందిన పిల్లి సంజరు(30) మృతిచెందాడు.