Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్రావుకు పీడీఎస్యూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్లో విద్యకు కనీసం 30 శాతం నిధులు కేటాయించాలని కోరుతూ పీడీఎస్యూ నాయకులు మంత్రి హరీశ్రావుకు వినతిపత్రాన్ని హైదరాబాద్లో ఆదివారం అందజేశారు. అనంతరం మీడియాతో పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్పల్లి రాము మాట్లాడుతూ...రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. జూనియర్ కళాశాల్లో సరిగ్గా తరగతి గదులు, ప్రయోగశాలలు లేవనీ, లెక్చరర్లు కొరత ఉందని వివరించారు. యూనివర్సిటీల్లో దాదాపు 2,500 ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ఛార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. మంత్రిని కలిసిన వారిలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు ఎస్.అనిల్, నాయకులు శ్రీకాంత్, విష్ణు, ఎన్.సుమంత్, తిమ్మేశ్, భీమేశ్, హన్మాన్, రాకేశ్, వంశ్రీ, నవీన్, నరేశ్, తదితరులు పాల్గొన్నారు.