Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరిగిన ఫుడ్ సేప్టీ ఆఫీసర్ల పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని టీఎస్పీఎస్సీ ప్రధాన కార్యదర్శి ఆర్.వాణీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి ఐదు గంటల వరకు 48 సెంటర్లలో జరిగిందని తెలిపారు. మొత్తం 36 ఫుడ్ సేప్టీ అధికారుల పోస్టులకుగానూ 13,526 మంది దరఖాస్తు చేసుకోగా... 8962 మంది పరీక్ష రాశారని తెలిపారు.
25న కెఎన్ఆర్యూహెచ్ఎస్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పరీక్ష
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్ఆర్యూహెచ్ఎస్, వరంగల్)లో ఈ నెల 25న జరిగే అసిస్టెంట్ రిజిస్ట్రార్ పరీక్ష కోసం అన్ని ఏర్పాటు పూర్తయ్యాయని టీఎస్పీఎస్సీ ప్రధాన కార్యదర్శి ఆర్.వాణీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంచామనీ, అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. అభ్యర్థులు 25న ఉదయం 9:30 గంటలకు హాల్టికెట్తో వచ్చి పరీక్షా కేంద్రాల్లో రిపోర్టు చేయాలని సూచించారు.