Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పథకాల్లో భాగస్వామ్యం చేయాలని డిమాండ్
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
సంక్షేమ పథకాల్లో తమకు భాగస్వామ్యం కల్పించాలని పలువురు ఎంపీటీసీలు నాగర్కర్నూల్ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆదివారం పాలెంలోని బాలాజీ గార్డెన్లో పట్టణ ప్రగతినపై అవగాహనా సదస్సు నిర్వహించారు. నూతన పంచాయతీ రాజ్ చట్టంపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడే క్రమంలో పలువురు ఎంపీటీసీలు నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. చెక్పవర్లో తమను భాగస్వామ్యం చేయాలని ప్రసంగానికి అడ్డుపడ్డారు. వెంటనే పార్టీ నాయకులు, పోలీసులు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. ఎంపీటీసీలకు మాట్లాడే అవకాశం కల్పిస్తామని మంత్రి చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం ఎంపీటీసీలు మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో సర్పంచ్లను భాగస్వామ్యం చేసి తమను నిర్లక్ష్యం చేయడం దారుణమని ఆగ్రహించారు.