Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నేచురోపతి భారతీయ వైద్యమనీ, దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన 'మెగా నేచురోపతి క్యాంపు'ను ఆయన ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ఒత్తిడి వల్లే 65శాతం రోగాలు వస్తాయన్నారు. వైద్య రంగంలో కొత్త టెక్నాలజీ ఎంత పెరిగినా వచ్చే రోగాలను ముందే గుర్తించలేకపోతున్నామని తెలిపారు. నేచురోపతికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. .