Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి ఉద్యోగి హక్కు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-ముషీరాబాద్
బతికేందుకు ఇచ్చే పింఛన్ ఎవరి భిక్షా కాదనీ, పింఛన్ ఉద్యోగుల హక్కు అనీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ అసోసియేషన్ నాల్గో, ద్వైవార్షిక మహాసభలో ఆయన మాట్లాడారు. దేశ, రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కోసం మూడు దశాబ్దాలకుపైగా సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు బతకడానికి ఇచ్చే పింఛన్ ఎవరి భిక్షా కాదన్నారు. అది వారి హక్కుగా సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఎంలపీ, ఎమ్మెల్యేల ఎంపికలో మాత్రమే అమలవుతోందన్నారు. ఇతర ఏ అంశాల్లో రాజ్యాంగం అమలుకు నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు మాట్లాడుతూ సామాజిక సంక్షేమం లేకుండా పెట్టుబడిదారుల ఆదాయం పెంచేందుకు మాత్రమే పాలకులు నిర్ణయాలు చేస్తున్నారని విమర్శించారు. యువకులకు ఉపాధి లేక నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే సీఏఏ తీసుకువచ్చి ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆగ్రహించారు. విద్య, వైద్యం సదుపాయాలు కల్పించటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. వయోవృద్ధులను కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. సభలో టీఏపీఆర్పీఏ అధ్యక్షులు పి.కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి ఎంఎన్ రెడ్డి, సత్యబ్రత బోసు, గోపాలరావు, శ్రీనివాస్, లక్ష్మయ్య పాల్గొన్నారు.