Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర నిధులు వచ్చేలా యూసీలివ్వండి : గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్ సమీక్షలో మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతిపైసాకు లెక్క ఉండాలని, అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి టి. హరీశ్రావు అన్నారు. ఆదివారం అరణ్య భవన్లో గిరిజన సంక్షేమశాఖ బడ్జెట్పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్ప్లాన్ నిధులు సరిగా ఖర్చు అయ్యేటట్టు చూడాలన్నారు. కేంద్ర నిధులతో పాటు అదనపు నిధులు వచ్చేలా యూసీలు ఇవ్వాలని సూచించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులకు తాము మ్యాచింగ్ నిధులు ఇస్తామనీ, ఆ డబ్బు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం గిరిజన సంక్షేమ శాఖదేనని అన్నారు. విద్యార్థులు, గిరిజనుల సంక్షేమానికి అడిగినన్ని నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లా డుతూ.. తమ శాఖకు మరింత ప్రాధాన్య మివ్వాలని కోరారు. అలాగే కల్యాణ లక్ష్మీ, పిల్లల ఆహారం, పాల బిల్స్ గ్రీన్ ఛానెల్లో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనుల సంక్షేమానికి సంబం ధించిన శాఖ కాబట్టి, ఎలాంటి కోతలు లేకుండా పెరిగిన అవసరాల మేరకు అదనపు కేటాయిం పులు చేయాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణా రావు, కార్యదర్శి శ్రీదేవి, రోనాల్డ్ రాస్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా, గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, నవీన్ నికోలస్ అధికారులు పాల్గొన్నారు.