Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఇద్దరు యువకుల అరెస్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో మత ఘర్షణలను సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కల్గించాలని యత్నించిన ఇద్దరు యువకులను సౌత్జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం అదనపు డీసీపీ జి.చక్ర వర్తి తెలిపిన వివరాల మేరకు
అర్షద్, అబ్దుల్ వసీలు స్నేహి తులు. జులాయిగా తిరిగే వీరు జల్సా లకు అలవాటయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో కొద్ది రోజుల క్రితం అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిం చేందుకు వీరు యత్నించారు. రెచ్చ గొట్టే విధంగా ఉన్న స్పీచ్లను ఫేస్ బుక్లో, యూటూబ్లో పోస్టు చేశారు. అంతటితో ఆగకుండా కొద్దిరో జుల క్రితం మాదన్నపేట్లో ఓ సీసాలో పెట్రోల్ పోసి విసిరి స్థానికు లను భయాందోళనకు గురిచేశారు. కంచన్ బాగ్లో ఓ బస్సుకు నిప్పుపెట్టేం దుకు యత్నించిన నిందితులు చాంద్ర యాణగుట్టలో ఓ ఏటీఎంను ధ్వసం చేసేందుకు ప్రయత్నించారు. అయితే వరస ఘటనలతో అప్రమత్తమైన టాస్క్ఫోర్సు పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీక రించారు. మాదన్నపేట్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. దాంతో నగరంలో అల్లర్లు సృష్టిం చేందుకు యువకులు ప్రయత్నిం చారని తేలడంతో తదుపరి విచారణ నిమిత్తం నిందితులను మాదన్నపేట్ పోలీసులకు అప్పగించారు.