Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
లాక్డౌన్ కారణంగా కొత్తపేటలోని రైతుబజార్ మంగళ వారం వీఎం హోంకు తరలించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలుదారులు విధిగా చేతులను శానిటైజర్తో శుభ్రపరుచుకోవాలన్నారు. ధరల సూచి ఆధారంగా మాత్రమే డబ్బులు చెల్లించాలన్నారు. సామాజిక దూరం పాటించాలన్నారు. మాస్కులను ప్రతి ఒక్కరు ధరించాలని కోరారు. వినియో గదారులకు ఇబ్బంది లేకుండా మార్కెట్లో ఏటీఎంలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ వీరమళ్ల రామ్నర్సింహ్మ పాల్గొన్నారు.