Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఏకపక్ష నిర్ణయం సమంజసం కాదని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక మండిపాటు
-ప్రభుత్వం మరోసారి పునారాలోచించాలని డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతనాల్లో 50శాతం కోత విధించడాన్ని ఉద్యోగులు, ఉపాధ్యా యులు, పెన్షనర్లు ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. కోత విషయమై ఉద్యోగ సంఘాల నేతలతో కనీసం సంప్రదిం చకుండా, సర్కారు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సబబు కాదని తెలిపింది. ఈ పరిస్థితుల్లో సగానికి కోత అంటే ఉద్యోగులంతా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుం దని సర్కారు మరొసారి పునరాలోచించాలని హైదరా బాద్ జిల్లా ఐక్యవేదిక కమిటీ సభ్యులు డి.సంజీవరావు (టీఎస్యూటీఎఫ్), ఎం.నరసింహా రెడ్డి(ఎస్టీయూ), ఎం.రవీందర్(టీపీటీఎఫ్),ఎస్.మల్లయ్య(డీటీఎఫ్), లక్ష్మణ్ రాథోడ్(టీటీఏ), బి.ప్రభాకర్(ఎస్జీటీయూ), ఎండీ. ఇఫ్తీకారుద్ధీన్(ఎస్జీటీఎఫ్), మల్లేశ్వరీ (టీడబ్ల్యూ టీఎఫ్), ఎండీ ఫారూఖ్(తాహిర్ ఏఐఐటీఏ), మదన్ మోహన్(ఎస్టీఎఫ్ టీఎస్) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50శాతం కోత పెట్టడం సమంజసం కాదని, ప్రభుత్వంతో పాటు తాము కరోనా వ్యాప్తి నిరోధానికి కృషి చేస్తున్నామని తెలిపారు. జనతా కర్ఫ్యూ( మార్చి 22) తర్వాత మార్చి నెలలో లాక్ డౌన్ సందర్బంగా కోల్పోయిన పని దినాలు కేవలం 6 రోజులు మాత్రమేనని, 6 రోజుల్లోనే ధనిక రాష్ట్రమని సగర్వంగా ప్రకటిచుకున్న తెలంగాణ ఆర్థికంగా దివాలా తీసిందా? దీనికే సగం జీతం కోత విధిస్తే ఏప్రిల్ నెల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా ఆర్థికపరంగా ఇలాంటి అసాధారణ చర్యలూ తీసుకోలేదన్నారు. అలాంటి పరిస్థితుల్లో జీతాల్లో కోత అంటే ఉద్యోగులు అందరూ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని మరోసారి పునరాలోచించి.. ఉద్యోగులందరికి పూర్తి వేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రిని హైదరాబాద్ జిల్లా ఐక్యవేదిక సభ్యులు డిమాండ్ చేశారు.