Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలికతో సంబంధం లైంగికదాడే: హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాలిక సమ్మతి తోనే లైంగిక సంబంధాన్ని పెట్టుకు న్నాననీ, దానిని లైంగికదాడిగా పరిగణించవద్దని దోషి చేసిన అప్పీల్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. బాలిక అంగీకారం చెప్పినప్పటికీ చట్ట ప్రకారం బాలికతో లైంగి క సంబంధం పెట్టుకోవడం అత్యాచారమే అవుతుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్, న్యాయ మూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. వరంగల్ జిల్లా మరిపేడ పోలీస్స్టేషన్ పరిధిలో 2014 అక్టోబర్లో నమోదైన బాలికపై అత్యాచార కేసులో వరంగల్ జిల్లా కోర్టు దోషి బానో తు రవికి యావజ్జీవ శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును రద్దు చేయాలనీ, బాలిక అంగీకరంతోనే లైంగి కంగా కలిశామని రవి హైకోర్టును అప్పీల్ పిటిషన్ ద్వారా వాదిం చారు. ఈ వాదనతో ఏకీభవించని హైకోర్టు.. యావజ్జీవ శిక్షను పదేండ్ల కు తగ్గించింది. పోక్సో, ఐపీసీల కింద నేరం రుజువు అయిందనీ, పెరోల్ ఇవ్వకుండానే శిక్షను అమలు చేయాలనీ, ఇప్పటి వరకు జైల్లో ఉన్న కాలాన్ని శిక్ష అనుభవించినట్లుగా పరిగణించాలని తీర్పులో స్పష్టం చేసింది.