Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రామాలయానికి వచ్చి చిక్కుకున్న కుటుంబీకులు
నవతెలంగాణ-ఇల్లందు
జనతా కర్ఫ్యూకు ముందు ఓ కుటుంబ సభ్యులు సందర్శన కోసం నాగపూర్ నుంచి భద్రాచలం వచ్చి చిక్కుకోగా తిరిగి నాగపూర్కు కాలినడకన మంగళవారం బయలుదేరారు. నాగపూర్ నుంచి ఆరుగురు కుటుంబ సభ్యులు మార్చి 21న భద్రాద్రి జిల్లా భద్రాచలంలోని రామాలయ దర్శనానికి వచ్చారు. కరోనాతో ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో అక్కడే ఉండిపోయారు. రోజులు గడుస్తున్నా పరిస్థితులు మెరుగయ్యేలా లేకపోవడంతో తిరిగి నాగపూర్ వెళ్లేందుకు కాలినడకన బయల్దేరారు. ఇల్లందుకు చేరుకోగానే విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ ముత్తయ్య వారితో మాట్లాడారు. ఇల్లందులోనే ఉండాలని చెప్పినా వారు అంగీకరించలేదు. వరంగల్ మీదుగా వెళ్తామని చెప్పారు. చేసేదేం లేక డీటీ ముత్తయ్య వారికి భోజనాల ఏర్పాట్లు చేసి పంపారు.