Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో విషాదం
నవతెలంగాణ-తంగళ్లపల్లి
కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో మంగళవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లెళ్లకు చెందిన దాసరి స్రవంతి(20) సిద్దిపేట జిల్లా హిందూరు కళాశాలలో బీటెక్ చదువుతోంది. తండ్రి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. తల్లి వ్యవసాయం చేసుకుంటూ తన మామ, కొడుకు, కూతురును పోషించుకుంటుంది. ప్రస్తుతం విద్యాసంస్థలు మూసివేయడంతో స్రవంతి ఇంటివద్దనే ఉంటుంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి, సోదరుడు పొలంనుంచి ఇంటికి వచ్చే సరికి పూర్తిగా కాలిపోయి చనిపోయింది. తనకు కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఆత్మహత్య చేసుకున్నట్టు రాసి ఉన్న సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ అభిలాష్ తెలిపారు.