Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఆర్థికమంత్రి హరీశ్
- సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పర్యటన
నవతెలంగాణ-గజ్వేల్
తెలంగాణ వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల మంది వలస కూలీలు ఉన్నారనీ, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లిలో మల్లన్నసాగర్ నిర్వాసితులకు నిర్మించే ఆర్అండ్ఆర్ కాలనీలో పర్యటించి అక్కడ పని చేసే వలస కూలీలతో మాట్లాడారు. వారికి ఆయన చేతుల మీదుగా ప్రతి ఒక్కరికీ రూ.500 నగదు, 12 కిలోల బియ్యం అందజేశారు. జిల్లాలోని వలస కూలీలకు ఏమైనా ఇబ్బందులుంటే అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లాలని లేదంటే 100 నెంబరుకు ఫోన్ చేయాలనీ సూచించారు. ఆరోగ్యం బాగా లేకపోయినా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం వైద్యం అందిస్తుందని తెలిపారు. ఈ పర్యటనలో రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మెన్ వంటేరు ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.