Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కెంటోన్మెంట్
ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రించేందుకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ మిర్జాలగూడ సాయి విహార రెసిడెన్సీ ఓనర్స్ అసోషియేషన్ వారు మంగళవారం సమావేశం నిర్వహించారు. కరోనా నివారించేందుకు ప్రభుత్వలు చేస్తున్న కషిలో తాము కూడా పాలు పంచుకోవాలని నిర్ణయించారు. ఈ 15 వరకూ అపార్ట్ మెంట్కు బయటివారిని అనుమతించకుడదని నిర్ణయించుకున్నారు. అపార్ట్ మెంట్ ప్రధాన కార్యదర్శి కె.యాదగిరి అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశంలో ఉపాధ్యక్షలు ఆర్.వాసు కరోనా ఎలా సోకుతుందనే విష యాలు వివరించారు. అనంతరం అధ్యక్షులు పతంజలి, ప్రతినిధులు చెన్నారెడ్డి. జనార్దన్ రెడ్డి, ప్రకాష్లు మాట్లాడుతూ.. అపార్ట్మెంట్ వాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.