Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సికింద్రాబాద్
వలస కార్మికుల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ ఉపసభాపతి తీగుళ్ల పద్మారావుగౌడ్ తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో 'లాక్ డౌన్' విధించిన దష్ట్యా సికింద్రాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో స్థిర పడ్డ ఇతర రాష్ట్రాల కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బంది ఏర్పాట్లు చేపడుతోందన్నారు. మంగళవారం నుంచి ఐదు కేంద్రాలను రెవెన్యు అధికారుల ఆధ్వర్యంలో ప్రారంభించినట్టు తెలిపారు. పౌర సరఫరాల అధికారులు, రెవిన్యూ, పోలీస్ వంటి వివిధ విభాగాల అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఐదు కేంద్రాల్లో ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్న స్థానికేతరులకు 12 కిలోల చొప్పున బియ్యం, రూ.500 నగదును పంపిణీ చేస్తామన్నారు.