Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మద్యం దుకాణాలు తెరుచుకుంటాయని ప్రచారం చేసిన నిందితుని అరెస్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా విస్తరించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలను మూసి వేశారు. అయితే మద్యం దుకా ణాలు తెరుచుకోనున్నాయని సోషల్ మీడి యాలో తప్పుడు ప్రచారాన్ని సృష్టించి వైరల్ చేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. జాయింట్ కమిషనర్ అవినాష్ మహంతీ తెలిపిన వివరాల మేరకు
ఉప్పల్కు చెందిన శనీస్ కుమార్ అలియాజ్ సన్నీ అనే యువకుడు రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకుంటాయని నకిలీ జీవోను ఈ నెల 28న సృష్టించాడు. 'డైరెక్టర్ ప్రొహిబీషన్ అండ్ ఎక్సైజ్ డిపార్టుమెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ' లేటర్ హెడ్ మీద, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎక్సైజ్ శాఖ విడుదల చేసిట్టుగా జీవోను విడుదల చేశాడు. ఈ నెల 29 నుంచి మద్యం దుకాణాలు తెరుచుకుంటాయని, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు అందు బాటులో ఉంటాయని సోషల్మీడియాలో వైరల్ చేశాడు. విషయం తెలుసు కున్న ఎక్సైజ్ టాస్క్ఫోర్సు డీఎస్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సీసీఎస్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ చేసిన మరో నలుగురికి నోటీసులు జారీ చేసినట్టు జాయింట్ కమిషనర్ తెలిపారు. ఎవరైనా తప్పుడు వార్తలను, వదంతులను సృష్టించి ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.