Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలోని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వలస కూలీల కోసం ఆహార కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్కు చెందిన వలస కూలీల కోసం నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో ఈ ఆహార కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 2,500 మంది కూలీలకు ఆహారం అందేలా చర్యలు తీసుకున్నట్టు సీపీ తెలిపారు. లాక్డౌన్ రోజుల్లో ఆహార కేంద్రాలు కొనసాగుతాయన్నారు. జ్వాల యోగి ట్రస్ట్, హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో ఆహార కేంద్రాల నిర్వహణ కొనసాగనున్నట్టు వెల్లడించారు.