Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పలువురు ప్రముఖులు, సంస్థలు పెద్దఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. ఇదే తరహాలో నగర పోలీసులకు చేయూతనిచ్చేందుకు మేము సైతం అంటూ పలువురు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ సెక్యురిటీ కౌన్సిల్(హెచ్సీఎస్సీ) సంస్థతో పాటు సాఫా సొసైటీ సంయుక్తంగా ముందుకొచ్చాయి. నగరంలోని పేదలకు, వలస కూలీలకు ఆహార పదార్థాలను అందజేసేందుకుగాను నగర పోలీస్లకు చేయూత నివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం నగర పోలీస్ కమిషనరేట్లో విరాళంగా రూ.8,01,000 చెక్కును నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్కు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పేదలు, వలస కూలీల సహాయార్థం వారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కరోనాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ నిర్వాహకులు, అధికారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
డిప్యూటీ కమిషనర్కు దయాసాగర్ రెడ్డి రూ.లక్ష విరాళం
హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ఆప న్న హస్తం అందించేందుకు ఉప్పల్లోని లక్మారెడ్డి కాలనీకి చెందిన మేకల దయాసాగర్ రెడ్డి ముందుకొచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ కృష్ణశేఖర్ను కలిసి రూ.లక్ష విరాళం అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయనను అభినందించారు. ఇలాంటి ఆపత్కాల పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి తమ వంతు సహయ సహాకారాలు అందించాలని కోరారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి తన వంతుగా సీఎం సహాయ నిధికి రూ.50వేలు, పీఎం కేర్స్కు రూ.50 చొప్పున అందించినట్టు తెలిపారు. ఉప్పల్ పరిధిలో నివసిస్తున్న పేదలు, వలస కూలీల కుటుంబాలకు సుమారు రూ.2లక్షలకు పైగా నిత్యావసర సరుకులు అందించ నున్నట్టు తెలిపారు. ఒక్క కుటుంబానికి 5కిలోల బియ్యం, కిలో పప్పుతో పాటు వంటకు అవసరమైన వస్తువులు ఉంటాయని, వీటిని తన తల్లి మేకల భారతమ్మ జ్ఞాపకార్ధం అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ నాగేందర్, మన్నే నర్సింహ్మా రెడ్డి పాల్గొన్నారు.