Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఈఎస్ఐలో కుంభకోణం పేరుతో కార్మికులకు అందని వేతనాలు
-రోడ్డున పడ్డ 120 కుటుంబాలు
-వారిని తొలగించేందుకు కుట్ర
-కార్మికులను ఆదుకోవాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఈఎస్ఐలో సర్కార్ నిర్లక్ష్యం, అధికారుల ఇష్టా రాజ్యంతో వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగింది. మందులు, ఇతర పరికరాలో కొనుగోళ్లలో అవకతవకలు జరిగిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఈఎస్ఐ డైరెక్టర్తో సహా పలువురు అధికారులు, మెడికల్ ఏజెన్సీల నిర్వాహకులను సైతం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అయితే ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగిందనే పేరుతో పదేండ్లుగా పనిచేస్తున్న 120 మంది కార్మికులను తొలగించాలనే కుట్ర జరుగుతోంది. అధికారుల అవినీతితో కార్మికులకు ఎలాంటి సంబంధం లేదు. కాని ఇదే సాకుతో ఏడాదికాలంగా కార్మికులకు వేత నాలు ఇవ్వడంలేదు. ఫలితంగా 120 కార్మిక కుటుం బాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురిం చింది. ఈ వేతనాల గురించి సచివాలయం చుట్టూ తిరుగుతున్నా మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వం స్పందన కరువైంది.
120 మంది కార్మికులు
ఈఎస్ఐ హస్పిటల్ డెవలప్మెంట్ కమిట ీ(హెచ్డీసీ) ఆధ్వర్యంలో 2011-12 ఆర్థిక సంవత్స రంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో 120 మంది కార్మికు లను నియమించుకున్నారు. సనత్నగర్ హస్పిటల్కు 60 మంది, రామచంద్రాపురం హస్పిటల్కు 48, వరంగల్ హస్పిటల్కు 12 మందిని కేటాయించారు. తర్వాత ఈ కార్మికులను విద్యార్హతల ఆధారంగా రాష్ట్రంలోని ఆయా డిస్పెన్సరీలకు ఆయా విభాగాలకు కేటాయించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని 50 డిస్పెన్సరీలు, రామగుండ, మంచిర్యాల్, సిద్ధిపేట్లో డిసెన్సీరీల్లో పనిచేస్తున్నారు. ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా వీరందరికి హస్పిటల్ డవలప్మెంట్ కమిటీ(హెచ్డీసీ) ఆధ్వర్యంలో వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెగ్యులర్ బడ్జెట్ నుంచి కార్మికులకు వేతనాలు ఇవ్వాలని మార్చి 2016లో ఉత్తర్వులు జారీచేసింది.
ఏడాదికాలంగా అందని వేతనాలు
కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన అధికారులు కార్మికులకు మాత్రం ఏడాదికాలంగా వేతనాలు ఇవ్వడంలేదు. మార్చి 2019 నుంచి మార్చి 2020 వరకు 120 మంది కార్మికుల వేతనాలను నిలిపేశారు. దీంతో కార్మికుల కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది. 120మంది కార్మికులకు సంబంధించిన వేతనాలు నెలకు రూ.21.20లక్షలు 13నెలలకు రూ.2.76కోట్లు అవుతుంది.
సచివాలయంలో ఫైల్
హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ(హెచ్డీసీ) ఆధ్వర్యంలో తీసుకున్న కార్మికులకు వేతనాలు ఇవ్వాలంటే ప్రభుత్వం అనుమతితో తీసుకోవాల్సిందేనని 2019లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ వేతనాల గురించి సర్కార్కు ఈఎస్ఐ డైరెక్టర్ లేఖ రాశారు. దీనికి సంబంధించిన ఫైల్ సచివాయంలో ఉంది. తమ వేతనాలు ఇప్పించాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిని కలిసి విన్నవించారు.
కార్మికులను ఆదుకోవాలి: ఎం శ్రీనివాస్, సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి
ఏడాది కాలంగా వేతనాల్లేక కార్మికులు అవస్థలు పడుతున్నారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చొరవ తీసుకుని వేతనాలు ఇప్పించాలి. లాక్డౌన్ నేపథ్యంలో కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి.