Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
లాక్డౌన్ నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు 12 కిలోల ఉచిత బియ్యం పంపిణీ నేటి నుంచి ప్రారం భం కానున్నది. రాష్ట్రంలో 87.54లక్షల ఆహార భద్రతా కార్డులుండగా 2.81కోట్ల మంది లబ్దిదారులు న్నారు. ప్రతి ఒక్కరికి 12కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నారు. ఇందుకోసం రూ.1,103 కోట్లు ఖర్చు కానున్నది. ఉచిత బియ్యం పంపిణీ సక్రమంగా జరిగేలా, ప్రజలు భౌతిక దూరం పాటించేలా ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షించాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగులకమలాకర్ ఆదేశించారు. ప్రజలం తా ఒకేసారి గుమిగూడకుండా అందరికి కూపన్లు జారీ చేయను న్నట్టు తెలిపారు. ప్రతి నెల రేషన్ తీసుకునే వారికి బయోమెట్రిక్ నుంచి మినహాయింపునివ్వగా, మిగిలిన వారు మాత్రమే బయోమెట్రిక్ పద్దతి పాటించాల్సి ఉంటుంది.