Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గచ్చిబౌలి సీపీ కార్యాలయంలో విధులు
నవతెలంగాణ-శంకర్పల్లి
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని పర్వేద గ్రామానికి చెందిన కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ప్రభుత్వ వైద్యాధికారి రేవతి తెలిపారు. అతడు గచ్చిబౌలిలోని సీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడని చెప్పారు. ఆయన విధులు నిర్వహిస్తున్న కార్యాలయంలోనే మరో కానిస్టేబుల్కు పాజిటివ్గా తేలింది. అతనితోపాటే అక్కడ ఉన్న పర్వేద గ్రామ కానిస్టేబుల్ జ్వరంతో బాధపడటంతో రెండు రోజుల కింద సిబ్బంది హైటెక్ సిటీలోని మెడిక్యూర్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా పాజిటివ్గా నిర్ధారించారు.