Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా గురువారం ఆన్ లైన్ ఉద్యమాన్ని చేయనున్నట్టు టీపీసీసీ అధ్యక్షులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యమంలో భాగస్వాములవుతారని చెప్పారు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రాం, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో వీడియోలను పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. ఆదాయ పన్ను పరిధిలోకి రాని ప్రతి పేద కుటుంబానికి వెంటనే రూ.10 వేలు నేరుగా అందించాలనీ, చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు, కార్మికులకు, రైతులకు, దినసరి వేతన దారులకు, మత్స్య కార్మికులకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులను ఉచిత రవాణాతో భద్రంగా వారి స్వస్థలాలకు చేర్చాలనీ, పేద కుటుంబాలకు నెలకు రూ. 7,500 రూపాయల చొప్పున 6 నెలల పాటు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.