Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ సెల్ ఏర్పాటు : పీజేటీఎస్ఏయూ వీసీ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
మార్కెట్కు అనుగుణమైన పంటల ఉత్పత్తి సాధించి మార్కెట్ డిమాండ్, సరఫరా మధ్య సమతుల్యత అవసరమనీ, దానిలో కీలక భూమిక పోషించేందుకు త్వరలో మార్కెట్ రీసెర్చ్ అనాలిసిస్ సెల్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ) వీసీ డాక్టర్ వి.ప్రవీణ్కుమార్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం నాడు పీజేటీఎస్ఏయూ అకడమిక్ కౌన్సిల్ సమావేశం ప్రవీణ్కుమార్ అధ్యక్షతన జరిగింది. కోవిడ్ నేపథ్యంలో బోధన, పరిశోధన, వ్యవసాయంలోనూ అనేక మార్పులు రాబోతున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అత్యున్నత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆన్లైన్ తరగతుల నిర్వహణపైనా కౌన్సిల్ చర్చించింది. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ సుధీర్కుమార్, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.