Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఐఏఎస్కు ఎంపికైన వారికి శిక్షణనిచ్చే ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిరిసిల్ల మోడల్ని అధ్యయన అంశంగా ఎంచుకున్నది. ఈ ఏడాది మొదటి దశ ఐఏఎస్ అధికారుల శిక్షణలో భాగంగా జిల్లాలో జరిగిన వాటర్ మేనేజ్మెంట్ కార్యక్రమాలను అధ్యయనం చేసి, అక్కడ శిక్షణ పొందుతున్న అధికారులతో పంచుకోనున్నది. ఆ జిల్లాపై అధ్యయనం చేసిన తర్వాత దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ట్రైనీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. గత ఆరేండ్లుగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, చిన్న తరహా సాగునీటి కార్యక్రమాలు, భూగర్భజలాలు కలుషితం కాకుండా తీసుకున్న చర్యలు, వాటర్ కన్జర్వేషన్ పద్దతుల వంటి బహుముఖ కార్యక్రమాల ద్వారా జిల్లాలో వాటర్ టేబుల్ 6 మీటర్లు పెరిగింది. జల నిర్వహణలో సాధించిన ఫలితాల నేపథ్యంలోముస్సోరిలోని శిక్షణ అకాడమీ ఈ నిర్ణయం తీసుకున్నది. సిరిసిల్ల మోడల్ జాతీయస్థాయిలో ఆదర్శవంతమైన ఉదాహరణగా ప్రశంసలు పొందడం పట్ల మంత్రి కె. తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు.