Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలాంటి వారికి కౌన్సిలింగ్: డీజీపీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కరోనా మహమ్మారి వెంటాడుతున్న నేపథ్యంలో బయట తిరిగే ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని పాటించడం తప్పని సరి అని స్పష్టం చేశారు. అందుకు తగిన చైతన్యాన్ని ప్రజల్లో కల్పించడానికి పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి బుధవారం తెలిపారు. లాక్డౌన్ లో కొన్ని వెసులు బాట్లను ప్రభుత్వం కల్పించిందని అయితే కొన్ని ప్రాంతాల ప్రజలు మాత్రం నిబంధనలను పాటించకుండా ఒకే చోట పెద్ద సంఖ్యలో చేరుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల కరోనా వైరస్ విస్తృతంగా విస్తరించే ప్రమాదం ఉన్నదనీ ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రోడ్లపై భౌతిక దూరాన్ని పాటించని వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించే సాంకేతిక పరిజ్ఞనాన్ని ప్రవేశ పెట్టామని దీని ద్వారా నిబంధనలను పాటించని వారిని గుర్తించడం జరుగుతుందని డీజీపీ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న తమ సిబ్బంది భౌతిక దూరాన్ని పాటించని వారికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.