Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అబ్కారీ శాఖమంత్రి శ్రీనివాస్గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆధునిక నీరా కేంద్రాలను దశల వారీగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్టు ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేస్తున్న నీరా కేంద్రం ప్రతిపాదిత స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సాంప్రదాయ నీరా ఉత్పత్తికి ప్రభుత్వం నుంచి గీత వత్తి దారులకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ వత్తి ద్వారా రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది ప్రత్యక్షంగా, 40 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గీత వత్తి, కల్లు అమ్మకాల పై ఉన్న ఆంక్షలను తొలగించినట్టు తెలిపారు. వృత్తిలో ప్రమాదానికి గురైతే ఇచ్చే ఎక్స్గ్రేషియోను రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచామన్నారు. గతంలో ఉన్న 10 కోట్ల పన్ను బకాయిలను రద్దు చేయటంతో పాటు తాటి, ఈత చెట్ల పన్నును పూర్తిగా రద్దుచేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యటకాభివద్ధి సంస్థ ఎండీ. మనోహర్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.