Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో జూన్ ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకూ పరిశుభ్రత, పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణతోపాటు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు ఆయన బుధవారం సమీక్షించారు. దోమల నివారణకు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించాలని ఆయన ఆదేశించారు.