Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యాసంగిలో 86 శాతం ధాన్యం కొనుగోళ్లు చేసినట్టు పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 6392 కేంద్రాల ద్వారా 7.37 లక్షల మంది రైతుల నుంచి 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు చెప్పారు. వీటికి సంబంధించిన రూ.6,433 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు పేర్కొన్నారు.2505 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి కావడంతో వాటిని మూసివేసినట్టు చెప్పారు.