Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.6121 నుంచి 3800 మధ్య ధర
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
లాక్డౌన్ సడలింపులతో నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు విక్రయాలు బుధవారం నుంచి పున:ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 5124 క్వింటాళ్ల పసుపు విక్రయాలు జరిగినట్టు మార్కెట్ కమిటీ సెక్రటరీ స్వరూపరాణి తెలిపారు. మార్కెట్ యార్డుకు పసుపు పోటెత్తింది. ఈ నామ్ ద్వారా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విక్రయాలు జరగ్గా, సాయంత్రం నాలుగు గంటల నుంచి 7 గంటల వరకు పంటను మార్కెట్ యార్డులోకి అనుమతించారు. లాక్డౌన్ దృష్ట్యా ప్రతిరోజూ 10 వేల బస్తాలను మాత్రమే అనుమతిస్తున్నట్టు తెలిపారు. పసుపు రకాన్ని బట్టి ధర రూ.6121 నుంచి 3800 మధ్య పలికింది. పంట చేతికొచ్చిన సమయంలోనే కరోనా లాక్డౌన్ వల్ల మార్కెట్ యార్డును మూసేశారు. దీంతో కొందరు రైతులు గ్రామాల్లోనే దళారులకు తక్కువ ధరకు పంటను అమ్ముకున్నారు.