Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఘటన
నవతెలంగాణ-గజ్వేల్
గజ్వేల్ మున్సిపల్ పరిధిలో రాజురెడ్డిపల్లి సింగరాయ చెరువులో బుధవారం ఐదు లక్షల విలువైన చేపలు మృత్యువాత పడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది సింగరాయి చెరువులో ప్రభుత్వం తరఫున లక్ష 45 వేల చేపపిల్లలను విడిచారు. స్థానిక ముదిరాజులు, మత్స్యకార్మికులు దాంతో ఉపాధి పొందుతున్నారు. చేపలు నాలుగైదు కిలోల సైజుకు పెరిగాయి. ఇక వాటిని పట్టి విక్రయించాలను వారు అనుకున్నారు. ముదిరాజులు, మత్స్యకార్మికులు చెరువు వద్దకు వెళ్లేసరికే చేపలు మృత్యువాత పడ్డాయి. వాటి విలువ సుమారు ఐదు లక్షలు ఉంటుందని మత్స్యకార్మికులు చెబుతున్నారు. మున్సిపల్ కమిషనర్, చైర్మెన్ రాజమౌళి, కౌన్సిలర్ బాలమణి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తహసీల్దార్ అన్వర్ దృష్టికి తీసుకుపోగా విచారణకు వీఆర్ఓను ఆదేశించారు. రాజురెడ్డిపల్లి, గజ్వేల్ తదితర ప్రాంతాల నుంచి సింగరాయ చెరువులోకి మురికి నీరు చేరుతుందని గ్రామస్తులు తెలిపారు. అందువల్లే చేపలు మృత్యువాత పడి ఉండొచ్చని ముదిరాజ్ సంఘం నాయకులు గుంటుక శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.