Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి కాలరీస్ పరిధిలోని బొగ్గు బ్లాకులను పరిరక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు బుధవారం ఒక లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో 20 లక్షల రూపాయల ప్యాకేజీలో భాగంగా 50 బొగ్గు బ్లాకులను ప్రయివేటుపరం చేస్తామనీ, అట్టి కాంట్రాక్టర్లకు వెయ్యి కోట్ల రూపాయల రుణమివ్వనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. సింగరేణి పరిధిలో 11 బ్లాకులను ప్రయివేపరం చేసే ప్రయత్నం జరుగుతున్నదనీ, రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సింగరేణి పరిధిలోని బ్లాకులను ప్రయివేటుపరం కాకుండా అడ్డుకోవాలని కోరారు. బ్లాకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపైనా ఒత్తిడితేవాలని కోరారు.