Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సినీరంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగానే వ్యవహరిస్తుందని సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మాసాబ్ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో సినిమా, సినిమా షూటింగ్లు, సినిమా థియేటర్ల ఓపెనింగ్ తదితర అంశాలపై సినీ ప్రముఖులు, తెలుగు టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానళ్ల నిర్వాహకులు మంత్రితో బుధవారం భేటీ అయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివద్ధి కేంద్రం(ఎమ్సీహెచ్ఆర్డీ)లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో గురువారం జరగనున్న సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. లాక్ డౌన్ కారణంగా సినీ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సుమారు 85 సినిమాల షూటింగ్లు వివిధ దశల్లో ఉన్నాయనీ, మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని మంత్రికి వివరించారు. షూటింగ్లకు అనుమతించడం వలన అనేక మందికి తిరిగి ఉపాధి లభిస్తుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.