Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అమాంతం తగ్గిపోయినమిర్చి ధరలు
- కోల్డ్ స్టోరేజీల్లో వ్యాపారుల నిల్వలు
నవతెలంగాణ-కాశిబుగ్గ
మిర్చి ధర అమాంతం పడిపోయింది. లాక్డౌన్కు ముందు మిర్చి క్వింటాకు రూ.25వేలు ఉండగా, నేడు రూ.14వేలకు మించలేదు. లాక్డౌన్ నేపథ్యంలో రెణ్నెల్లుగా మార్కెట్లు బందవడం, ఆ సమయంలోనూ రైతులను నమ్మించి వ్యాపారులు అతి తక్కువ ధరకు మిర్చి కొని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకోవడంతో అన్నివిధాలా రైతులకు నష్టం వాటిల్లింది. బుధవారం మార్కెట్లు ప్రారంభమైనా డిమాండ్ లేదనే సాకుతో మళ్లీ వ్యాపారం కొనసాగిస్తున్నారు.
జూన్ 1 నుంచి మార్కెట్ను పున:ప్రారంభిస్తామని ప్రచారం జరిగినా వరంగల్ ఎనుమాముల మార్కెట్ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బుధవారమే ప్రారంభించడంతో రైతులు తక్కువ సంఖ్యలో పంటను తీసుకొచ్చారు. లాక్డౌన్కు ముందు ప్రతిరోజూ మార్కెట్కు 50నుంచి 60 వేల మిర్చి బస్తాలు వచ్చేవి. బుధవారం 20వేల బస్తాలు మాత్రమే వచ్చాయి. ధరలో మాత్రం రెణ్నెల్ల కింద గరిష్టంగా క్వింటాకు రూ.25వేలు ఉండగా.. నిన్న రూ.14వేలకు మించలేదు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదనే సాకుతో వ్యాపారులు తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. దాంతో సాగు ఖర్చులు, కూలీ రేట్లు, రవాణా చార్జీలు పెరిగినా పంటకు ధర లేక పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునేందుకు వచ్చిన రైతులతో ధరలు మరింత తగ్గిపోతాయనీ, లాక్డౌన్ ఇప్పట్లో ఎత్తేయరనీ వ్యాపారులు నమ్మబలికారు. ఇలా ఈ రెణ్నెల్లలో దాదాపు 70 లక్షల బస్తాల మిర్చిని కొని కోల్డ్ స్టోరేజీలో నిల్వచేసుకోవడం గమనార్హం.
పెట్టుబడి రావడం లేదు : జైపాల్రెడ్డి, రావులపల్లి, రేగొండ మండలం
తేజ రకం మిర్చి 10 బస్తాలు తీసుకొచ్చిన. క్వింటాకు రూ.7 వేలు పడింది. పెట్టుబడి కూడా రావడం లేదు. ధర ఒక్కసారిగా పడిపోవడంతో ఏం చేయాలో తెలుస్తలేదు. మిర్చి ఏరడానికి కూలి ఆడ మనిషికి రూ.300, మగ మనిషికి రూ.500 ఇస్తున్నాం. ఇప్పుడున్న ధరకు పెట్టుబడులు, కూలీల ఖర్చులు, రవాణా చార్జీలు పోతే ఏమీ మిగలడం లేదు.
కావాలనే తగ్గించారు
తేజ రకం మిర్చి 24 బస్తాలు తెచ్చిన. ధర రూ.7వేలు పెట్టారు. గతంలో 25వేలు అమ్మిన మిర్చి ధరను ఒక్కసారిగా తగ్గించారు. కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకొని రుణం పొందుదామనుకుంటే అధికారులు అనేక నిబంధనలు పెడుతున్నారు. వ్యాపారులు కావాలనే ధరలు తగ్గించారు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి.
- శ్రీనివాస్, గర్మిళ్లపెళ్లి, టేకుమట్ల మండలం