Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఇల్లు అమ్మేందుకు అడ్డొస్తుందని సజీవ దహనం
నవతెలంగాణ-క్లాక్టవర్
నల్లగొండ మండల నర్సింగ్బట్లలో దారుణం జరిగింది. ఇల్లు అమ్మడానికి అడ్డొస్తుందని కన్న తల్లిని కొడుకే సజీవ దహనం చేశాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామానికి చెందిన తిరుమల శాంతమ్మ(75)కు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడైన తిరుమల లింగస్వామి హైదరాబాద్లో ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. భార్యతో మనస్పర్థలతో దూరంగా ఉంటున్నాడు. ఆస్తుల పంపకంలో భాగంగా గ్రామంలో ఎకరం పొలంతోపాటు తల్లి పోషణ కూడా చూసుకోవాలని అన్నదమ్ముల మధ్య ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో లింగస్వామి పది రోజుల కిందట గ్రామానికి వచ్చాడు. ఇల్లు అమ్మాలని తల్లి శాంతమ్మపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె నిరాకరించడంతో మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో పడుకున్న తల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఆమె సజీవ దహనమైంది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పంచనామా నిర్వహిం చారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐ మహబూబ్బాషా పరిశీలించారు. మతురాలి మనమడు బొడ్డుపల్లి బాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.